Wednesday 17 February 2016

   ప్రముఖ సినిమా రచయిత, నాటకకర్త, కథకులు శ్రీ నడిమింటి నరసింగ రావు గారు ఈ రోజు (17.2.2016) గుంప సోమేశ్వర క్షేత్రం లో భద్రకాళి ప్రతిష్టాపన కోసం సతీ సమేతంగా  విచ్చేశారు. వారు చిన్నపిల్లకోసం ఆనందబాల చేస్తున్న కృషిని ఎంతగానో కొనియాడారు. వారికి ఆనందబాల ధన్యవాదాలు తెలియజేసుకొంటోంది.

   శ్రీ నరసింగ రావు గారి జన్మ స్థలం కురుపాం (విజయనగరం జిల్లా) . జాతీయ స్థాయిలో నిలబడిన ఏకైక తెలుగు నాటకం "బొమ్మలాట" రచయిత శ్రీ నడిమింటి నరసింగ రావు గారు. రాంగోపాల్ వర్మ "అనగనగా ఒక రోజు", "కళ్ళు" వంటి ఎన్నో సినిమాలకు మాటలను అందించారు.  ఈ టీవీ లో  ఎన్నో డైలీ సీరియల్స్ కి మాటలు అందించారు. వారితో నేను కలిసి ఈ టీవీ "శ్రీభాగవతం" సీరియల్  కి మాటలను రాయడం జరిగింది.
                                          - తుంబలి శివాజీ  

No comments:

Post a Comment