చిట్టి
కథలు-4
దున్నవలె
పార్వతీపురం
జమీందారు పార్వతీశం తరతరాలుగా వచ్చిన ఆస్తినంతా కోల్పోయినా అహంభావం ఏమాత్రం తగ్గక ప్రజలందరికీ
దూరంగా ఉంటూ వచ్చాడు. అతనికి ఎవరితోనూ మంచిగా మాట్లాడడం రాలేదు. గతంలో అతనికి సహాయకునిగా పనిచేసిన గౌరప్ప
కవి అతని ఆర్ధిక పరిస్థితిని గమనించి “ఊరిలో రైతుల్ని పిలుచుకొచ్చాను. మీరు ఒక్కసారి
మీ భూముల్ని దున్నమని చెప్పండి చాలు” అని సలహా
ఇచ్చాడు.
బయట ఉన్న రైతులనుద్దేశించి “ఎవరక్కడ.. దున్నవలె” అన్నాడు పార్వతీశం. అంతే..
జమీందారు తమను దున్నలవలె ఉన్నామని తిట్టినట్లు భావించిన రైతులు అక్కడనుంచి వెళ్ళిపోయారు.
పాపం.. గౌరప్ప కవి అవాక్కయ్యాడు.
రచన: తుంబలి శివాజీ
No comments:
Post a Comment