చిట్టి
కథలు-2
ఒకటో
తరగతి గదిలో పిల్లలంతా గొడవ గొడవ చేస్తున్నారు. ఉపాధ్యాయురాలు ఎంత చెబుతున్నా ఒక
పాప మాత్రం లంకించుకున్న ఏడుపుని ఏమాత్రం ఆపడం లేదు.
“ఏంటమ్మా!
ఏమైంది?” అడిగింది ఉపాధ్యాయురాలు.
“నా పెన్సిల్ పోయింది. ఎవరో దొంగిలించారు...”
అంది పాప.
“అయ్యో!
మరిప్పుడెలా? ఇదుగోండి.. ఎవరైనా తన పెన్సిల్ తీస్తే ఇచ్చేయండి. నేను ఎవరినీ ఏమీ
అనను” చెప్పింది ఉపాధ్యాయురాలు. అందరూ మిన్నకున్నారు. “ఆ పెన్సిల్ దొంగిలించినవారికి
ఈ రాత్రి తప్పకుండా జ్వరమొస్తుంది..“ భయపెట్టింది ఉపాధ్యాయురాలు.
అంతే! ఆ పక్కనున్న చిన్నారి సౌమ్య “నాకివ్వేళ
జ్వరమొస్తుంది... వా...” అంటూ కెవ్వున ఏడ్చింది. “నీకేం జ్వరం రాదుగా.. ఆ పెన్సిల్
ఆ పాపకి ఇచ్చేస్తాంగా..” అంటూ బుజ్జగించింది ఉపాధ్యాయురాలు.
రచన: తుంబలి శివాజీ
No comments:
Post a Comment