Wednesday 23 September 2015

చిట్టి కథలు-10

                            స్వామివారేరి?
          ప్రసాదు ఇంటి బయట చదురు మీద కూర్చొని తెలుగువాచకంలో పద్యాలు బిగ్గరగా రాగయుక్తంగా చదువుకుంటున్నాడు. ఇంట్లోనుండి అమ్మ “నాయనా! స్వామివారొచ్చారా?” అని ప్రతి రొజూ భిక్షకు వచ్చే దాసరిని ఉద్దేశించి అడిగింది. చదువులో నిమగ్నమైన ప్రసాదుకి అమ్మ పిలుపు వినబడలేదు. 
       అమ్మ చేతిలో చిన్న పళ్ళెంతో దాసరికి బియ్యం వేసేందుకు బయటకు వచ్చింది. బయట చూస్తే దాసరి కనబడ లేదు. లోనికి వెళ్ళిపోయింది. మరలా దాసరి రాగాలు వినబడి వచ్చి చూసింది. ఈ సారీ దాసరి కనబడ లేదు. ఇలా మూడు సార్లు జరిగింది.
ఈమారు దాసరి కోసం ఎదురుచూస్తూ బయటే కూర్చుంది అమ్మ.  ప్రసాదు మరల పద్యాలూ చదవడం ప్రారంభించాడు. అది విన్న అమ్మ విరగబడి నవ్వింది. ఇంత వరకు తాను దాసరి పద్యాలుగా పొరపడింది ప్రసాదు చదువుతున్న పద్యాలు వినే.
                           రచన: తుంబలి శివాజీ

No comments:

Post a Comment