Wednesday 30 December 2015

No comments:
శుభాకాంక్షలు

ఆనందబాల... ఆబాలగోపాలం  అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటోంది. ఈ ఏడాది అంతా శుభాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తోంది..పిల్లలలెక్కడున్నాఆనందమే. ఆ పిల్లలను ఆనందపెడితే లోకానందమే. అదే ఆనందబాల లక్ష్యం. ఈ ఏడాది కొత్త సొబగులతో వస్తున్న ఆనందబాలను  వీక్షిస్తూ ఉండండి. శుభమగుగాక. 

Saturday 26 December 2015

No comments:
క చిత్రం వేయి హృదయాలను కదిలిస్తుంది. వేల స్వప్నాలను ఆవిష్కరిస్తుంది. ప్రకృతి అందాలను కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. కళాకారులు తనలోని స్పందనలను, తనకు ఎదురైన అనుభవాలను పదిలపరచుకొనేందుకు చిత్రకళను సాధనంగా మలచుకుంటాడు. కోటి  భావాలను ఒక గీతలో ప్రపంచానికి పరిచయం చేయగలడు చిత్రకారుడు.  అనుభూతులను ఆవిష్కరించడమే కాదు అన్యాయాలను ప్రశ్నించడమూ కళకు మరింత కళను తెస్తుంది.  అటువంటి కళాకారులు శ్రీ ఆప్తచైతన్య. పార్వతీపురంలో 27 డిసెంబర్ 2015 నాడు చిత్రకళా ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.  ఆబాలగోపాలం ఆనందంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని అరుదైన అనుభూతులను మీ సొంతం చేసుకోండి.   
                                                                                                               - తుంబలి శివాజీ

Tuesday 22 December 2015

No comments:
ఆనందబాల కామిక్స్-5

ఆనందబాల కామిక్స్ చిన్నారులను ఎంతగానో అలరిస్తాయి. చిత్రాలతో చెప్పే కథలు బాలలను ఆకట్టుకోవడమే కాదు, వారి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకుంటాయి.

Sunday 13 December 2015

No comments:
చిట్టి కథలు-16

                                పంచదార  కారం..!
బుడ్డి వాళ్ళ  అమ్మమ్మగారిల్లు వారింటి పక్కనే ఉంది. తమ ఇంట్లో చీమలెక్కువ ఉన్నాయని బుడ్డి అమ్మ అమ్మమ్మగారింట్లో చక్కెర డబ్బా దాచింది. బుడ్డిని అమ్మమ్మ దగ్గరకు వెళ్లి కప్పు నిండా చక్కెర తీసుకు రమ్మని చెప్పింది అమ్మ.  అతడు అలాగే అని వెళ్లి చక్కెర తీసుకువస్తుండగా గోడ  చాటుకు వచ్చేసరికి అందులో కొంత తినేయాలనే దుర్భుద్ధి పుట్టింది. అలానే చేశాడు. అది ప్రతి రోజూ అలవాటయింది. ఒక రోజు అమ్మ “అమ్మమ్మ దగ్గరకు వెళ్ళు. ఈ కప్పు నిండా ఏమిస్తే అది తీసుకురా” అని తొందర పెట్టింది. పరుగు పరుగున అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి వస్తున్న బుడ్డి చీకట్లో గోడ చాటుకు వచ్చి అందులో ఏముందో చూడకుండా నోట్లో వేసుకున్నాడు. అప్పుడే అమ్మ లైట్ వేసింది. అతనికి నోట్లో కారం, మంట... తట్టుకోలేక పోతున్నాడు. అతని కళ్ళల్లో నీళ్ళు చూసి అమ్మ “ఏమయిందిరా?” అని అడిగింది. “అమ్మా.. పంచదార కారంగా ఉందే..” అంటూ ఏడుపు అందుకున్నాడు. జరిగిన దానికి వెంటనే నవ్వు వచ్చినా అమ్మ మనసు బాధపడి అతనికి తగిన చికిత్స చేసింది. ఆ రోజు నుంచి బుడ్డి ఎటువంటి దొంగ పనీ చేయలేదు.
                      రచన: తుంబలి శివాజీ

Wednesday 9 December 2015

3 comments:
"ఊహలకే రెక్కలోస్తే" జానపద నవల
పిల్లలూ !  భుజం మీద పుస్తకాల సంచి, చేతిలో ఆహారపు బాక్సుతో బడికి  వెళ్ళుతున్నప్పుడో, రోడ్డు మీద ట్రాఫిక్ జాంలో ఇరుకున్నప్పుడో ‘ఈ బాదరబందీలు లేకుండా ఏదైనా పక్షిలా మారిపోయి కావలసిన దగ్గరకు ఎగిరి వెళ్ళగలిగేలా భుజాలకు రెక్కలుంటే బాగుండును అనిపిస్తుంది కదూ!’  గాలిలో ఎగిరి వెళ్ళే పక్షులను చూసినప్పుడల్లా  “వాటి పనే బాగుంది. పుస్తకాలు మొయ్యక్కరలేదు.  ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగక్కర లేదు. గాలిలో ఎగురుతూ నచ్చిన ప్రదేశానికి  వెళ్లొచ్చు . చార్జీలు కట్టక్కరలేదు” అనిపిస్తుంది కదూ! మీకే కాదు చాలా మంది పిల్లలకి  అలాగే  అనిపిస్తుంది.
అలాంటి ఆలోచనే  ఊహలకే రెక్కలొస్తే  నవలా నాయకుడు, యువరాజు  ఆనందవర్మకి కూడా వచ్చింది. కావలసిన రూపంలోకి మారిపోయే మంత్రం ఆనందవర్మకు ఒక వింత వస్తువు ద్వారా తెలుసుకున్న ఆనందవర్మ  నచ్చిన పక్షి రూపంలోకి మారిపోయేవాడు .  అవేం  మాట్లాడుకుంటాయో, ఎలా ప్రవర్తిస్తాయో   తెలుసుకునే వాడు . అంతులేని ఆనందం అనుభవించేవాడు.
తన సైనికులు తిరుగుబాటుకు  కుట్ర చేస్తున్నారని వేగుల ద్వారా విన్న ఆనందవర్మ ,  సైనికులు సమావేశమైన చోటుకి పిచ్చుక రూపంలో వెళ్లి వాళ్ళ ముఖాలు చూడడమే కాకుండా వాళ్ళేం మాట్లాడుకున్నారో వింటాడు. సైనికులని  పిలిచి తనకు తెలిసిన సంగతులు చెప్పి ఎందుకు శిక్షించకూడదో చెప్పమంటాడు. వాళ్ళు బుకాయించినా సరే తప్పించుకోలేక పోతారు. సైనికులoదరినీ ఖైదు చేసి శిక్షిస్తాడు ఆనందవర్మ.
మనసుకి నచ్చిన యువతిని ఆమెకు తెలియకుండా దగ్గర నుండి చూడాలని,  భార్యగా చేసుకోవాలని చిలుక రూపంలో వెళ్లి ఆమెను  కలుస్తాడు ఆనందవర్మ. అప్పుడు ఆమె అందం చూసి ముచ్చట పడి ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అప్పటికీ వింత సరదా తగ్గించుకోమని తెలివైన మంత్రి సలహా ఇస్తుంటాడు ఆన0దవర్మకి. వాటిని పెడచెవిని  పెట్టి మనసుకి నచ్చిన పక్షి రూపంలోకి మారిపోయి విజయాలు సాధిస్తూ , క్లిష్టమైన పరిపాలనా సమస్యలని కూడా సులభంగా పరిష్కరించిన  యువరాజు ఒకసారి  ఆపదలో చిక్కుకుంటాడు. ఆయన ఆపద నుండి బయటపడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? పక్షి రూపంలోకి మారిపోయి సరదా తీర్చుకోవాలన్న ఆలోచన ఆనందవర్మ జీవితంలో ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? తెలుసుకోవాలంటే మాత్రం “ఊహలకే రెక్కలొస్తే”  నవలను  వెంటనే కొని చదవాల్సిందే. మీరు కూడా మీ ఊహలకు రెక్కలు తొడిగి ఆనందలోకాల్లో విహరించి రావాలనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం? వెంటనే ‘ఊహలకే రెక్కలోస్తే’ నవల కొని చదివెయ్యండి!
ప్రముఖ చిత్రకారుడు తుంబలి శివాజీ చిత్రించిన అందమైన ముఖచిత్రంతో, నాణ్యమైన కాగితంపై బొమ్మలతో ముద్రించిన ఈ నవల ధర 45.00 రూపాయలు మాత్రమే.  ఇది గోత్ర పబ్లికేషన్స్ ప్రచురణ. కాపీలు కావల్సిన వాళ్ళు  గోత్ర పబ్లికేషన్స్, పార్వతీపురం (98492 27509) వారిని సంప్రదించవచ్చు.  లేదా మీకు దగ్గరలోని నవచేత పబ్లిషింగ్ హౌస్ లేదా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ దగ్గర పొందవచ్చు. లేదంటే నవలా రచయితను కింది చిరునామాలో సంప్రదించి పొందవచ్చు.  ఎక్కువ కాపీలు కొనే వారికి డిస్కౌంట్ ఉంటుంది. 
చిరునామా: నారంశెట్టి ఉమామహేశ్వరరావు, ఇంటి నెంబరు:14-1-83, సరస్వతీ నివాస్, గవర్నమెంట్ ఆసుపత్రి రోడ్, సబ్ జైలు ఎదురుగా, బెలగాం, పార్వతీపురం H.O. విజయనగరం జిల్లా (ఆంధ్ర ప్రదేశ్)
CELL: 94907 99203, 7386406905.

                                                - సమీక్ష: గుడ్ల అమ్మాజీ ,పార్వతీపురం.

Thursday 3 December 2015

2 comments:

ఆనందబాల – మరో పాఠశాల
నందబాల చక్కని బాలసాహిత్య వేదిక. ఇది తెలుగు బాలల కోసం ఆవిర్భవించిన సాహితీ సంస్థ. బాలసాహిత్యాన్ని ప్రాణంగా భావించే కవి, చిత్రకారుడు, సినీ గేయ రచయిత తుంబలి శివాజీ (98492 27509) కలలకు రూపం, కళల దీపం. నేటి సాహిత్యంలో కొరవడుతున్న నైతిక విలువలను పెంచేందుకు, బాలలను మంచి సృజనాత్మకత గల వ్యక్తులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు, వారి తెలివితేటలను పెంచి, మంచి వ్యక్తిత్వ  నిర్మాణం  చేసేందుకు దోహదపడుతుంది.
ఆనందబాల కథలకు చదివించే గుణం ఉంటుంది. ఈ చక్కని కథలు చదివిన తెలుగు బాలలు వారి పఠన సామర్ధ్యమును పెంచుకోవడంతో పాటు ఆలోచనాత్మకతను పొందుతారు. ఈ కథలు తెలుగు బాలల మనసులను ఎంతగానో ఆహ్లాదపరుస్తాయి. వారిని కలల లోకంలో ఊరేగించి వినోదింపజేస్తాయి మరియు వికాసాన్ని కలిగిస్తాయి.   

బాల సాహిత్యం సార్వజనీనమైనది. శాశ్వత విలువలు కలిగినది. తరతరాలకు నిలిచే సామర్ధ్యం కలిగినది. ఏ సాహితీ వేత్త అయినా బాల సాహిత్య స్పృహ, స్పర్శ లేనిదే పరిపూర్ణుడు కాలేడు. అటువంటి బాలసాహిత్యాన్ని తెలుగు నాట ఆవిష్కరించేందుకు కంకణం కట్టుకున్నది ఆనందబాల. కథలు, గేయాలు, గేయ కథలు, కామిక్ కథలు, ఆబాలగోపాలాన్ని అలరించే అనేక అంశాలతో ఆవిష్కృతమైంది. పత్రికలూ, లఘుచిత్రాలు, సచిత్ర గ్రంథాలు, ఇంకా ఎన్నో రూపాలతో బాలలను అలరిస్తూ, తెలుగు భాషా పరిరక్షణ చేస్తూ తెలుగు నాట ఓ ప్రత్యేకతను సంతరించుకున్నది ఆనందబాల.