ఒక చిత్రం వేయి హృదయాలను
కదిలిస్తుంది. వేల స్వప్నాలను ఆవిష్కరిస్తుంది. ప్రకృతి అందాలను కళ్ళకు కట్టినట్టు
చూపుతుంది. కళాకారులు తనలోని స్పందనలను, తనకు ఎదురైన అనుభవాలను పదిలపరచుకొనేందుకు
చిత్రకళను సాధనంగా మలచుకుంటాడు. కోటి
భావాలను ఒక గీతలో ప్రపంచానికి పరిచయం చేయగలడు చిత్రకారుడు. అనుభూతులను ఆవిష్కరించడమే కాదు అన్యాయాలను ప్రశ్నించడమూ
కళకు మరింత కళను తెస్తుంది. అటువంటి కళాకారులు
శ్రీ ఆప్తచైతన్య. పార్వతీపురంలో 27 డిసెంబర్ 2015 నాడు చిత్రకళా ప్రదర్శనను
నిర్వహిస్తున్నారు. ఆబాలగోపాలం ఆనందంగా ఈ
కార్యక్రమంలో పాలుపంచుకొని అరుదైన అనుభూతులను మీ సొంతం చేసుకోండి.
- తుంబలి శివాజీ
No comments:
Post a Comment