Wednesday 9 December 2015

"ఊహలకే రెక్కలోస్తే" జానపద నవల
పిల్లలూ !  భుజం మీద పుస్తకాల సంచి, చేతిలో ఆహారపు బాక్సుతో బడికి  వెళ్ళుతున్నప్పుడో, రోడ్డు మీద ట్రాఫిక్ జాంలో ఇరుకున్నప్పుడో ‘ఈ బాదరబందీలు లేకుండా ఏదైనా పక్షిలా మారిపోయి కావలసిన దగ్గరకు ఎగిరి వెళ్ళగలిగేలా భుజాలకు రెక్కలుంటే బాగుండును అనిపిస్తుంది కదూ!’  గాలిలో ఎగిరి వెళ్ళే పక్షులను చూసినప్పుడల్లా  “వాటి పనే బాగుంది. పుస్తకాలు మొయ్యక్కరలేదు.  ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగక్కర లేదు. గాలిలో ఎగురుతూ నచ్చిన ప్రదేశానికి  వెళ్లొచ్చు . చార్జీలు కట్టక్కరలేదు” అనిపిస్తుంది కదూ! మీకే కాదు చాలా మంది పిల్లలకి  అలాగే  అనిపిస్తుంది.
అలాంటి ఆలోచనే  ఊహలకే రెక్కలొస్తే  నవలా నాయకుడు, యువరాజు  ఆనందవర్మకి కూడా వచ్చింది. కావలసిన రూపంలోకి మారిపోయే మంత్రం ఆనందవర్మకు ఒక వింత వస్తువు ద్వారా తెలుసుకున్న ఆనందవర్మ  నచ్చిన పక్షి రూపంలోకి మారిపోయేవాడు .  అవేం  మాట్లాడుకుంటాయో, ఎలా ప్రవర్తిస్తాయో   తెలుసుకునే వాడు . అంతులేని ఆనందం అనుభవించేవాడు.
తన సైనికులు తిరుగుబాటుకు  కుట్ర చేస్తున్నారని వేగుల ద్వారా విన్న ఆనందవర్మ ,  సైనికులు సమావేశమైన చోటుకి పిచ్చుక రూపంలో వెళ్లి వాళ్ళ ముఖాలు చూడడమే కాకుండా వాళ్ళేం మాట్లాడుకున్నారో వింటాడు. సైనికులని  పిలిచి తనకు తెలిసిన సంగతులు చెప్పి ఎందుకు శిక్షించకూడదో చెప్పమంటాడు. వాళ్ళు బుకాయించినా సరే తప్పించుకోలేక పోతారు. సైనికులoదరినీ ఖైదు చేసి శిక్షిస్తాడు ఆనందవర్మ.
మనసుకి నచ్చిన యువతిని ఆమెకు తెలియకుండా దగ్గర నుండి చూడాలని,  భార్యగా చేసుకోవాలని చిలుక రూపంలో వెళ్లి ఆమెను  కలుస్తాడు ఆనందవర్మ. అప్పుడు ఆమె అందం చూసి ముచ్చట పడి ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అప్పటికీ వింత సరదా తగ్గించుకోమని తెలివైన మంత్రి సలహా ఇస్తుంటాడు ఆన0దవర్మకి. వాటిని పెడచెవిని  పెట్టి మనసుకి నచ్చిన పక్షి రూపంలోకి మారిపోయి విజయాలు సాధిస్తూ , క్లిష్టమైన పరిపాలనా సమస్యలని కూడా సులభంగా పరిష్కరించిన  యువరాజు ఒకసారి  ఆపదలో చిక్కుకుంటాడు. ఆయన ఆపద నుండి బయటపడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? పక్షి రూపంలోకి మారిపోయి సరదా తీర్చుకోవాలన్న ఆలోచన ఆనందవర్మ జీవితంలో ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? తెలుసుకోవాలంటే మాత్రం “ఊహలకే రెక్కలొస్తే”  నవలను  వెంటనే కొని చదవాల్సిందే. మీరు కూడా మీ ఊహలకు రెక్కలు తొడిగి ఆనందలోకాల్లో విహరించి రావాలనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం? వెంటనే ‘ఊహలకే రెక్కలోస్తే’ నవల కొని చదివెయ్యండి!
ప్రముఖ చిత్రకారుడు తుంబలి శివాజీ చిత్రించిన అందమైన ముఖచిత్రంతో, నాణ్యమైన కాగితంపై బొమ్మలతో ముద్రించిన ఈ నవల ధర 45.00 రూపాయలు మాత్రమే.  ఇది గోత్ర పబ్లికేషన్స్ ప్రచురణ. కాపీలు కావల్సిన వాళ్ళు  గోత్ర పబ్లికేషన్స్, పార్వతీపురం (98492 27509) వారిని సంప్రదించవచ్చు.  లేదా మీకు దగ్గరలోని నవచేత పబ్లిషింగ్ హౌస్ లేదా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ దగ్గర పొందవచ్చు. లేదంటే నవలా రచయితను కింది చిరునామాలో సంప్రదించి పొందవచ్చు.  ఎక్కువ కాపీలు కొనే వారికి డిస్కౌంట్ ఉంటుంది. 
చిరునామా: నారంశెట్టి ఉమామహేశ్వరరావు, ఇంటి నెంబరు:14-1-83, సరస్వతీ నివాస్, గవర్నమెంట్ ఆసుపత్రి రోడ్, సబ్ జైలు ఎదురుగా, బెలగాం, పార్వతీపురం H.O. విజయనగరం జిల్లా (ఆంధ్ర ప్రదేశ్)
CELL: 94907 99203, 7386406905.

                                                - సమీక్ష: గుడ్ల అమ్మాజీ ,పార్వతీపురం.

3 comments:

  1. చక్కని సమీక్ష అందించిన ఆనందబాల కు, కవి మిత్రులు తుంబలి శివాజి గారికి ధన్యవాదాలు.

    ReplyDelete
  2. చక్కని సమీక్ష అందించిన ఆనందబాల కు, కవి మిత్రులు తుంబలి శివాజి గారికి ధన్యవాదాలు.

    ReplyDelete
  3. మీనుంచి మరిన్ని మంచి బాలల రచనలు రావాలని కోరుతున్నాం.

    ReplyDelete